News March 24, 2024
మోదీని ’28 పైసా PM’ అని పిలుద్దాం: ఉదయనిధి
తమిళనాడు రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయి పన్నుకి రూ.28 పైసలే కేంద్రం వెనక్కి ఇస్తోందని మండిపడ్డారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు లబ్ధి జరుగుతోందని అన్నారు. ఇక నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ’28 పైసా పీఎం’ అని పిలుద్దామంటూ ఫైర్ అయ్యారు. తమిళనాడుపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.
Similar News
News October 3, 2024
అక్టోబర్ 3: చరిత్రలో ఈరోజు
1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం
1954: నటుడు సత్యరాజ్ జననం
1978: భారత్లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం
News October 3, 2024
ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మా జవాబు గట్టిగా ఉంటుంది: ఇరాన్
ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ తాజాగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. తాము యుద్ధం కోరుకోమని, ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మాత్రం జవాబు గట్టిగా ఉంటుందని దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. ‘ఇజ్రాయెల్ కారణంగానే మేం స్పందించాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో అస్థిరత పెంచాలనేది ఆ దేశపు కుట్ర. ఈ రక్తపాతాన్ని ఆపాలని అమెరికా, ఐరోపా దేశాలు టెల్ అవీవ్కు చెప్పాలి’ అని స్పష్టం చేశారు.
News October 3, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.