News October 26, 2024
AI అవకాశాలతో APని అభివృద్ధి చేస్తాం: లోకేశ్

ట్రెండింగ్లో ఉన్న AI అవకాశాలను వినియోగించుకుని APని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. USA శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘AI ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం’ అని వెల్లడించారు.
Similar News
News January 30, 2026
విమాన ప్రమాదం.. పైలట్ ట్రాఫిక్లో చిక్కుకోవడంతో..

మహారాష్ట్ర Dy.CM <<18990751>>అజిత్ పవార్<<>> విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్లైట్ నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ వేరే పైలట్ స్థానంలో వచ్చినట్లు అతని ఫ్రెండ్స్ తెలిపారు. ‘కొన్ని రోజుల క్రితమే సుమిత్ హాంగ్కాంగ్ నుంచి వచ్చారు. పవార్ను బారామతి తీసుకెళ్లాల్సిన పైలట్ ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కొన్ని గంటల ముందే సుమిత్కు ఆ బాధ్యత అప్పగించారు’ అని పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
News January 30, 2026
రూ.లక్ష జీతంతో ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగాలు

<
News January 30, 2026
విష్ణువు వరాహ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు?

హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి, భూమిని సముద్ర గర్భంలో దాచాడు. దీంతో సృష్టి కార్యానికి ఆటంకం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుంచి అతి చిన్న రూపంలో వరాహ స్వామి ఉద్భవించాడు. క్షణ కాలంలోనే ప్రచండ రూపం దాల్చాడు. లోకోద్ధరణ కోసం సముద్రంలోకి దూకి, హిరణ్యాక్షుడిని సంహరించి, కోరలపై భూమిని నిలిపి పైకి తెచ్చాడు. వేదాలను రక్షించి, భూమిని ఉద్ధరించడమే ఈ అవతార ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత తిరుమలలో కొలువయ్యారు.


