News October 26, 2024
AI అవకాశాలతో APని అభివృద్ధి చేస్తాం: లోకేశ్

ట్రెండింగ్లో ఉన్న AI అవకాశాలను వినియోగించుకుని APని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. USA శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘AI ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం’ అని వెల్లడించారు.
Similar News
News January 13, 2026
నిరసనలు ప్రపంచానికి తెలియకుండా.. ఇంటింటికీ వెళ్లి..!

నిరసనలను ఉక్కుపాదంతో అణచేస్తున్న ఇరాన్ ఆ వివరాలు ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్ నిలిపేయగా, మస్క్కు చెందిన <<18836391>>స్టార్లింక్ సేవలనూ<<>> 80% కట్ చేసింది. ఇంకా వాడుతున్న వారిని వెంటాడుతోంది. ఇళ్లలో సోదాలు చేసి స్టార్లింక్ పరికరాలు స్వాధీనం చేసుకుంటోంది. అధికారులు, ఖమేనీ సపోర్టర్లు ‘వైట్లిస్ట్(అనుమతి ఉన్న వారికే యాక్సెస్ ఉండే)’ నెట్వర్క్లో కమ్యూనికేట్ అవుతున్నారు.
News January 13, 2026
యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా!

సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ను యూపీఎస్సీ వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సింది. కానీ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల పోస్ట్పోన్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. కాగా ప్రిలిమ్స్ పరీక్ష మే 24న, మెయిన్స్ ఆగస్టు 21న నిర్వహిస్తామని గతంలో యూపీఎస్సీ ప్రకటించింది.
News January 13, 2026
రేపే మకరజ్యోతి దర్శనం

శబరిమలలో రేపు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాగా రేపు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికే అనుమతి ఉంది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.


