News June 28, 2024
వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోం: సోము వీర్రాజు
AP: వైసీపీ MPలను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి పార్టీలో చేరుతారన్న ప్రతిపాదన గాని, ఆలోచన కానీ లేదన్నారు. EVMలపై అనుమానాలున్నాయని YCP నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పారు.
Similar News
News September 20, 2024
ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం నో
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. ఈ పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమంటూ పిటిషన్పై విచారణను ముగించింది. రేవంత్ రెడ్డికి కేసు విషయాలు రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.
News September 20, 2024
సిట్టింగ్ జడ్జి/ హైకోర్టు కమిటీతో విచారించాలి:YCP
తిరుమల లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించినట్లు YCP ట్వీట్ చేసింది. ‘హైకోర్టులో వైసీపీ న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని హైకోర్టును న్యాయవాది కోరారు. పిల్ దాఖలు చేస్తే బుధవారం వాదన వింటామని ధర్మాసనం చెప్పింది’ అని YCP ట్వీట్ చేసింది.
News September 20, 2024
టీటీడీని ప్రక్షాళన చేస్తాం: మంత్రి లోకేశ్
AP: వైసీపీ దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేసిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. తిరుమల బోర్డును తమ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలబోనని స్పష్టం చేశారు. క్యాన్సర్ గడ్డలా మారిన పాపాల పెద్దిరెడ్డిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.