News June 4, 2024
అభివృద్ధి పథం వైపు సాగుదాం: సీఎం రేవంత్

ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంగ్రాట్స్ చెప్పారు. ‘ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 11, 2025
తడబడుతున్న భారత్

SAతో జరుగుతున్న రెండో T20లో పరిస్థితులు భారత్కు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో IND తడబడుతోంది. 32 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయింది. తొలి మ్యాచ్లో 4 రన్స్ చేసిన వైస్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్ అయ్యారు. దూకుడుగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ(17) ఔటవ్వగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5) మరోసారి నిరాశ పరిచారు. SA బౌలింగ్లో జాన్సెన్ 2, ఎంగిడి ఒక వికెట్ తీశారు.
News December 11, 2025
హోరాహోరీ.. 3 ఓట్లతో విజయం

TG: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. కొందరు స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సొంతం చేసుకుంటున్నారు. రంగారెడ్డి(D) ఫరూక్నగర్ మండలం శేరిగూడలో కొండం శారద శంకర్గౌడ్ 3 ఓట్లతో గెలుపొందారు. అటు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్లో అన్నాచెల్లెళ్లు బరిలో నిలవగా చెల్లెలు స్రవంతి ఘన విజయం సాధించారు.
News December 11, 2025
కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండండి: మమత

SIR పేరుతో ఓట్లు తొలగిస్తే కనుక అడ్డుకోవడానికి కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండాలని WB CM మమత మహిళలకు పిలుపునిచ్చారు. వారితో పాటే పురుషులూ పోరాడాలన్నారు. ‘మీరు దాడి చేస్తే ఎలా అడ్డుకోవాలో తెలుసు. BIHAR చేయలేకపోయింది. మేము చేసి చూపిస్తాం’ అని BJPని హెచ్చరించారు. ఆ పార్టీ IT సెల్ రూపొందించిన జాబితాతో ఎన్నిక జరపాలని చూస్తోందన్నారు. WB నుంచి ప్రజలను వెళ్లగొట్టేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.


