News July 3, 2024
రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం: భట్టి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1717866339174-normal-WIFI.webp)
TG: ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రెస్మీట్లో స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. గత ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.
Similar News
News July 6, 2024
బడ్జెట్ కసరత్తుపై ఆర్థిక శాఖ తర్జనభర్జన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720209524254-normal-WIFI.webp)
AP: అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా? రెండు, మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టాలా? అని ఆర్థిక శాఖ తర్జనభర్జన పడుతోంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, చాలా శాఖల్లో లెక్కలు కొలిక్కి రావడం లేదని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్ కష్టమని చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్, APకి నిధుల విషయాల్లో స్పష్టత వచ్చాక పూర్తి బడ్జెట్ పెట్టొచ్చనే ప్రతిపాదనలున్నాయి.
News July 6, 2024
రైతుల అభిప్రాయాలు సేకరించనున్న కేబినెట్ సబ్ కమిటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720208819098-normal-WIFI.webp)
TG: రైతుభరోసా విధివిధానాలు రూపొందించడంపై మంత్రివర్గ ఉపసంఘం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోజుకు మూడు సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. 5ఎకరాలు కటాఫ్ పెట్టాలనే దానిపై చర్చించనున్నారు. 16వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ కానుంది.
News July 6, 2024
త్వరలో నూతన ఐటీ పాలసీ: లోకేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720206584880-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించేందుకు త్వరలో నూతన ఐటీ పాలసీ తెస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆయా రంగాల్లో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్ను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో కంపెనీలకు కేటాయించేందుకు ఎంత మేర భూమి ఉందో నివేదిక ఇవ్వాలన్నారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.