News July 18, 2024

ఏపీ రావణకాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం: షర్మిల

image

AP: పల్నాడు(D) వినుకొండలో జరిగిన హత్య ఘటన అత్యంత దారుణమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘నడిరోడ్డుపై ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు. ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్థుడిని కఠినంగా శిక్షించాలి. రాజకీయ హత్య అయితే కూటమి ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీటికి అడ్డుకట్ట వేస్తారా? లేదా? రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 11, 2025

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
* వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
* కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది.
* అన్నం మెతుకులు విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి.
* చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.

News November 11, 2025

పుట్టగొడుగులు, కూరగాయలతో ఏటా రూ.7.50 కోట్ల వ్యాపారం

image

కూరగాయలు, ఆర్గానిక్ విధానంలో పుట్టగొడుగుల పెంపకంతో నెలకు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఆగ్రాకు చెందిన అన్నదమ్ములు ఆయుష్, రిషబ్ గుప్తా. వీరు ఆగ్రాలో 2021లో కూరగాయల సాగు, 2022లో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. నేడు నెలకు 40 టన్నుల పుట్టగొడుగులు, 45 టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. వీరి వార్షిక టర్నోవర్ రూ.7.5 కోట్లు. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 11, 2025

మల్లోజుల, తక్కళ్లపల్లి రాజకీయ ద్రోహులు: అభయ్

image

TG: ఇటీవల లొంగిపోయిన సీనియర్ మావోలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావును ‘రాజకీయ ద్రోహులు’గా పేర్కొంటూ మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. వీరిద్దరూ MH, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారని, వారికి మావోయిస్టు పంథాను తప్పుబట్టే హక్కులేదని మండిపడ్డారు. దివంగత మావోయిస్టు నేత నంబాల కేశవరావు ఆయుధాలు విడిచిపెట్టాలని ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు.