News May 8, 2025

త్రివిధ దళాల క్షేమం కోసం ప్రార్థిద్దాం!

image

సరిహద్దుల్లో సైనికులు రేయింబవళ్లు గస్తీ కాస్తుండటం వల్లే మనం క్షేమంగా ఉంటున్నాం. ప్రత్యర్థులు తూటాలు సంధిస్తున్నా మన జవాన్లు ముందుండి ధైర్యంగా పోరాడుతున్నారు. ఆ సమయంలో కొందరు సైనికులు చనిపోయి కుటుంబానికి శోకాన్ని మిగుల్చుతుంటారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో మన సైనికులకు ఎలాంటి హానీ జరగొద్దని, వారు క్షేమంగా ఉండాలని మనమంతా ప్రార్థిద్దాం. వారంతా మన ఫ్యామిలీనే అని గుర్తిద్దాం. ‘జైహింద్’ COMMENT

Similar News

News January 20, 2026

రాష్ట్రంలో 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ డిస్ట్రిక్ కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr. అసిస్టెంట్, ఎగ్జామినర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, ఏడో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in

News January 20, 2026

గ్రీన్‌లాండ్ టెన్షన్‌.. కుదేలైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలు చవిచూశాయి. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నిఫ్టీ 353 పాయింట్లకుపైగా పడిపోయి 25,232 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1065 పాయింట్లకు పైగా నష్టపోయి 3 నెలల కనిష్ఠమైన 82,180కి చేరింది. గ్రీన్‌లాండ్‌పై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్‌ల బెదిరింపులతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

News January 20, 2026

మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

image

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.