News January 12, 2025
ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పిద్దాం: సీఎం

AP: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో జీవితాల్లో వెలుగులు తెచ్చి, తెలుగు జాతిని నంబర్-1 చేసేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్ను ఆవిష్కరించామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్షిప్) విధానం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందులో అందరూ భాగస్వాములవ్వాలని, ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.
Similar News
News November 5, 2025
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News November 5, 2025
దేశాన్ని కించపరిచే ప్రయత్నం: రాహుల్పై బీజేపీ ఫైర్

హరియాణాలో 25 లక్షల <<18204949>>ఓట్ల చోరీ <<>>జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై BJP తీవ్రంగా స్పందించింది. అవి నిరాధార, అసత్య ఆరోపణలని, దేశాన్ని కించపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడింది. భారత వ్యతిరేక శక్తులతో కలిసి రాహుల్ గేమ్స్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి రిజిజు ఫైరయ్యారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే ఈసీని లేదా కోర్టును ఆశ్రయించాలని, కానీ ఆయన అలాంటివి చేయరని ఎద్దేవా చేశారు.
News November 5, 2025
BELలో 47 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(B<


