News October 28, 2024
‘కూటమి’ డైవర్షన్ పాలిటిక్స్ను తిప్పికొడదాం: వైసీపీ

AP: కూటమి ప్రభుత్వం 5 నెలలుగా ఒక్క కొత్త పథకమూ అమలు చేయలేదని వైసీపీ విమర్శించింది. ‘ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ‘జూన్లో రుషికొండ భవనాలు, జులైలో శ్వేతపత్రాలు, AUGలో ముంబై నటి, SEPలో ప్రకాశం బ్యారేజీలో బోట్లు, శ్రీవారి లడ్డు, OCTలో YSR కుటుంబంపై విషప్రచారాలు చేసింది. వీటిని తిప్పికొడుతూ ప్రభుత్వ నయవంచనలను నిలదీయాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


