News May 20, 2024

జూన్ 4 తర్వాత మాట్లాడుదాం: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ నేతలు విదేశాలకు పారిపోతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. నారా లోకేశ్ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూన్ 4న ఫలితాల తర్వాత అన్ని మాట్లాడుదాం అని అన్నారు. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.

Similar News

News November 24, 2025

ఇతిహాసాలు క్విజ్ – 76

image

ఈరోజు ప్రశ్న: రావణుడు సీతమ్మవారిని అపహరించినా, ఆమెను బలవంతంగా ముట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 24, 2025

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సొంత నియోజకవర్గం కొడంగల్‌లో CM రేవంత్ ఇవాళ పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనునున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 సర్కార్ స్కూళ్లలో హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తోంది. అది సక్సెస్ కావడంతో ఇదే తరహాలో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News November 24, 2025

వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

image

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.