News May 12, 2024

సగర్వంగా ఓటేద్దాం: ఈసీ

image

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.

Similar News

News October 23, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలకంగా చర్చిస్తున్నారని సమాచారం. ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన కొండా సురేఖ సైతం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.

News October 23, 2025

మహిళలూ బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు కూడా నిత్యం వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. హెల్మెట్ వాడటం తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్​ బేబీ బెల్ట్​, ఛైల్డ్‌ క్యారియర్‌ వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.

News October 23, 2025

సన్నధాన్యం: ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్

image

TG: సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తోంది. అయితే బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేర ఉంటేనే బోనస్ వస్తుంది. గ్రెయిన్ కాలిపర్ అనే మిషన్‌ ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6mm, వెడల్పు 2mm కంటే తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5mm కంటే ఎక్కువ ఉండేవాటికి ప్రాధాన్యం ఇస్తారు. * రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.