News May 12, 2024
సగర్వంగా ఓటేద్దాం: ఈసీ

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.
Similar News
News March 18, 2026
రేపే ఉగాది.. ఇలా చేస్తే మంచిది!

తెలుగు క్యాలెండర్ ప్రకారం ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరం రేపు ప్రారంభంకానుంది. ఇది గతాన్ని విశ్లేషించుకొని కొత్త విజయాల వైపు సాగాలని సూచిస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి, ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పంచాంగ శ్రవణం వినడం వల్ల నూతన సంవత్సర రాశిఫలాలు, గ్రహాల ప్రభావం తెలుస్తుంది. గుమ్మాలకు పసుపు, కుంకుమ రాసి ముగ్గులు వేయాలి. ఇష్ట దైవానికి పూజ చేసి దానం చేయడం శుభప్రదం. SHARE IT
News March 18, 2026
మరో 10 రోజుల్లో సందడే సందడి!

క్రికెట్ అభిమానుల నిరీక్షణకు మరో 10 రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 28న IPL సీజన్-19 అట్టహాసంగా <<19356627>>ప్రారంభం<<>> కానుంది. 10 జట్లు టైటిల్ వేటలో పోటీ పడనున్నాయి. సమ్మర్లో సుమారు 2 నెలల పాటు ఫ్యాన్స్కు వినోదం పంచనున్నాయి. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ RCB, SRH తలపడనున్నాయి. మరి మీ ఫేవరెట్ టీమ్ ఏది? టైటిల్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News March 18, 2026
ధురంధర్-2: ఇంకా థియేటర్లకు చేరని సెకండాఫ్?

భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా షోలపై అనుమానాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి కేవలం ఫస్టాఫ్ మాత్రమే థియేటర్లకు చేరినట్లు సమాచారం. క్లైమాక్స్, సెకండాఫ్లో కొన్ని మార్పులు చేస్తుండటంతో పూర్తి సినిమా అందడంలో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా కంటెంట్ పొందే థియేటర్లు మేనేజ్ చేసినా హార్డ్ డ్రైవ్లపై ఆధారపడే సింగిల్ స్క్రీన్లకు కష్టాలు తప్పవు.


