News March 1, 2025
తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని లేఖ

AP: ఇటీవల తిరుమల కొండపై పలుమార్లు విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కోరారు. ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్ర నిబంధనల దృష్ట్యా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
Similar News
News November 25, 2025
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అమలు

ఎన్నికల మోడల్ కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలను బుధవారం మరోసారి పరిశీలించాలని RDOలు, ఎంపీడీవోలను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల్లో పోలీసు బందోబస్త్ పెట్టాలని సూచించారు. స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులకు మళ్లీ శిక్షణ ఇవ్వాలని, రిపోర్టులు వెంటనే పంపాలని తెలిపారు. ప్రజలు, పార్టీలు, మీడియా సహకరించాలని కోరారు.
News November 25, 2025
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అమలు

ఎన్నికల మోడల్ కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలను బుధవారం మరోసారి పరిశీలించాలని RDOలు, ఎంపీడీవోలను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల్లో పోలీసు బందోబస్త్ పెట్టాలని సూచించారు. స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులకు మళ్లీ శిక్షణ ఇవ్వాలని, రిపోర్టులు వెంటనే పంపాలని తెలిపారు. ప్రజలు, పార్టీలు, మీడియా సహకరించాలని కోరారు.
News November 25, 2025
పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.


