News April 16, 2025
ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ UNOకి లేఖ

MHలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధిని రక్షించాలని కోరుతూ మెుఘల్ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ UNOకు లేఖ రాశారు. అసత్య ప్రచారాల వల్ల సమాధిని కూల్చివేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరిగాయని లేఖలో తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చారిత్రక కట్టడాలను కాపాడేలా ప్రత్యేక భద్రతను కల్పించాలని కోరారు. కాగా గత నెలలో ఔరంగజేబు సమాధి కేంద్రంగా మత ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News November 7, 2025
వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్కు తరలింపు

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.
News November 7, 2025
భారత్ స్వర్గధామంలాంటి ఆశ్రయం ఇచ్చింది: హసీనా

బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వంలో తీవ్రవాదులకు మద్దతునివ్వడం వల్ల ఇండియాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆదేశ ex-PM షేక్ హసీనా అన్నారు. అవామీ లీగ్పై నిషేధంతో తన మద్దతుదారులు రానున్న ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. మైనారిటీలు దాడులకు గురవుతున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు ఆధారాలు సమర్పిస్తానన్నారు. భారత్ తనకు స్వర్గధామంలాంటి ఆశ్రయాన్ని కల్పించిందని ప్రశంసించారు.
News November 7, 2025
శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి NOV 14-JAN 21 మధ్య 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లామ్, నర్సాపూర్-కొల్లామ్, చర్లపల్లి-కొల్లామ్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొంది. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.


