News April 16, 2025
ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ UNOకి లేఖ

MHలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధిని రక్షించాలని కోరుతూ మెుఘల్ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ UNOకు లేఖ రాశారు. అసత్య ప్రచారాల వల్ల సమాధిని కూల్చివేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరిగాయని లేఖలో తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చారిత్రక కట్టడాలను కాపాడేలా ప్రత్యేక భద్రతను కల్పించాలని కోరారు. కాగా గత నెలలో ఔరంగజేబు సమాధి కేంద్రంగా మత ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News April 16, 2025
గురూజీకి తమిళ హీరో షాక్?

అల్లు అర్జున్-అట్లీ సినిమా ఖరారు కావడంతో ఈ గ్యాప్లో ఓ సినిమా చేయడంపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తమిళ హీరో శివకార్తీకేయన్కు ఆయన కథ చెప్పగా రెమ్యునరేషన్ రూ.70 కోట్లు అడిగినట్లు సమాచారం. ఇంత అమౌంట్ వెచ్చిస్తే వర్కౌట్ కాదని త్రివిక్రమ్ ఆసక్తి కనబరచనట్లు టాక్. దీంతో ప్రస్తుతం ఆ సినిమాను చేయట్లేదని తెలుస్తోంది. మరోవైపు వెంకీకి గురూజీ కథ చెప్పగా ఆయన ఓకే చెప్పాల్సి ఉంది.
News April 16, 2025
అమిత్షా కుట్ర వల్లే బెంగాల్లో హింస: మమత

పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో హింస చెలరేగేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కుట్ర పన్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. BSF బలగాలు బంగ్లాదేశ్ ఆగంతకులను దేశంలోకి చొరబడేలా అనుమతించాయన్నారు. అమిత్షా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంపై ప్రయోగించకుండా ప్రధాని నియంత్రించాలని కోరారు. కాగా ఈ నిరసనల్లో ముగ్గురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు.
News April 16, 2025
‘వక్ఫ్’పై ఆందోళనలు హింసాత్మకం కావడం బాధాకరం: సుప్రీం

వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ జరిగిన <<16100810>>ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై<<>> సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘటనలు తమను బాధించాయని పేర్కొంది. అనంతరం వక్ఫ్ చట్టంపై ప్రశ్నించగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జవాబిచ్చారు. ‘వక్ఫ్ చట్టం కోసం చాలా కసరత్తు చేశాం. బిల్లుపై JPC 38 సమావేశాలు నిర్వహించింది. 98.2 లక్షల విజ్ఞప్తుల్ని పరిశీలించింది’ అని తెలిపారు.