News May 18, 2024
ఆలయాల్లో లైబ్రరీలు పెట్టాలి: ఇస్రో ఛైర్మన్

యువత ఆలయాలకు రావట్లేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంది. అలాంటి ఆలయాలకు యువత వచ్చేలా నిర్వాహకులు ఆకర్షించాలి. అవసరమైతే గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు పఠనాసక్తి ఉన్న వారు ఆలయాల బాట పడతారు. జ్ఞానం పెంచుకుని ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకుంటారు’ అని ఓ అవార్డు స్వీకారోత్సవంలో ఆయన తెలిపారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


