News May 18, 2024
ఆలయాల్లో లైబ్రరీలు పెట్టాలి: ఇస్రో ఛైర్మన్

యువత ఆలయాలకు రావట్లేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంది. అలాంటి ఆలయాలకు యువత వచ్చేలా నిర్వాహకులు ఆకర్షించాలి. అవసరమైతే గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు పఠనాసక్తి ఉన్న వారు ఆలయాల బాట పడతారు. జ్ఞానం పెంచుకుని ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకుంటారు’ అని ఓ అవార్డు స్వీకారోత్సవంలో ఆయన తెలిపారు.
Similar News
News November 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
News November 22, 2025
ఓపెనర్గా ఫాస్టెస్ట్ సెంచరీ.. వార్నర్ సరసన హెడ్

ENGతో తొలి టెస్టులో 69బంతుల్లోనే సెంచరీ చేసిన AUS ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓపెనర్గా వచ్చి వేగంగా శతకం బాదిన బ్యాటర్గా వార్నర్ సరసన నిలిచారు. 2012లో INDపై వార్నర్ 69బాల్స్లోనే సెంచరీ కొట్టారు. ఇక ఛేజింగ్లో 4వ ఇన్నింగ్స్లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా, ఓవరాల్గా ఫాస్టెస్ట్ శతకం బాదిన 8వ బ్యాటర్గా హెడ్ నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో మెక్కల్లమ్ ఉన్నారు. ఆయన AUSపై 54బంతుల్లోనే సెంచరీ కొట్టారు.
News November 22, 2025
అలాగైతే తులం బంగారం, రూ.2,500 ఇచ్చేవాళ్లం: జూపల్లి

TG: పథకాల అమలుపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తులం బంగారం, రూ.2,500 ఏమయ్యాయంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో పాటు బంగారం ఇవ్వాలంటే మరో రూ.లక్ష అవుతుంది. తులం బంగారం అమలుకు రూ.4వేల కోట్లు, మహిళలకు రూ.2,500 ఇవ్వడానికి రూ.10వేల కోట్లు కావాలి. ఏడాదికి రూ.75వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. BRS అప్పులు చేయకుండా ఉండి ఉంటే పథకాలన్నీ అమలయ్యేవి’ అని అన్నారు.


