News February 3, 2025

పుస్తకాలకు బదులు వ్యక్తుల కథలు తెలుసుకునే లైబ్రరీలు!

image

లైబ్రరీకి వెళ్లగానే ‘సైలెంట్ ప్లీజ్’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, డెన్మార్క్‌లోని లైబ్రరీలలో వివిధ రకాల ప్రజల కథలు మారుమోగుతుంటాయి. పుస్తకాలకు బదులు అక్కడున్న వ్యక్తులను తీసుకెళ్లి, వారి జీవిత కథను వినొచ్చు. ప్రతి వ్యక్తికి ‘నిరుద్యోగి’, ‘శరణార్థి’లాంటి శీర్షికలు ఉంటాయి. వీరి కథలను విని ఒక పుస్తకాన్ని దాని కవర్ చూసి అంచనా వేయకూడదనే విషయాన్ని తెలుసుకుంటారు. దీనిని హ్యూమన్ లైబ్రరీ అంటారు.

Similar News

News November 14, 2025

బిజినేపల్లిలో 12.7 డిగ్రీల కనిష్ఠం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో అత్యల్పంగా బిజినపల్లి, తెలకపల్లి మండల కేంద్రాలలో 12.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అమ్రాబాద్‌లో 12.8, వెల్దండ 12.9, ఊర్కొండ 13.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ లీడింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో EVM ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షేక్‌పేట డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు 8,911, BRSకు 8,864 ఓట్లు పోలయ్యాయి. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉండగా.. 11న పోలింగ్ రోజు సాయంత్రం BRS-కాంగ్రెస్ ఇక్కడ దొంగ ఓట్లపై ఆరోపణలు చేసుకున్నాయి.

News November 14, 2025

బిహార్‌లో 2 చోట్ల MIM ఆధిక్యం

image

దేశమంతా ఆసక్తిగా చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ BJPకి అనుకూలంగా ఉన్నాయి. NDA 66 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా ఇందులో BJPవి 40, JDU 24 స్థానాలు. ఇక MGB 44 చోట్ల లీడ్ ప్రదర్శిస్తుండగా వీటిలో RJD-35, కాంగ్రెస్-7 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమౌర్‌లో 2020లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి అక్తారుల్ ఇమాన్ ఈసారీ లీడ్‌లో ఉన్నారు.