News December 10, 2024
‘LIC బీమా సఖి’.. నెలకు రూ.7,000 స్టైఫండ్

మహిళా సాధికారిత లక్ష్యంగా LIC బీమా సఖి యోజన పథకాన్ని PM మోదీ ప్రారంభించారు. ఏడాదిలో లక్ష మందిని నియమించుకోనున్నట్లు LIC MD సిద్ధార్థ్ మహంతి ప్రకటించారు. టెన్త్ అర్హత కలిగి 18-70ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. వీరికి మూడేళ్లపాటు ఆర్థిక అంశాలు, బీమాపై శిక్షణ ఇస్తారు. తొలి ఏడాది ₹7K, రెండో ఏడాది ₹6K, మూడో ఏడాది ₹5K చొప్పున ప్రతినెలా స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ తర్వాత LIC ఏజెంట్గా పనిచేయొచ్చు.
Similar News
News September 23, 2025
జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
News September 23, 2025
24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు తీసుకోలేదు: అమిత్ షా

గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్విరామమైన పని PM నిర్ణయాలపై, పనివేగంపై ప్రభావం చూపలేదన్నారు. కఠినమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో ఎలాంటి బాస్ కల్చర్ లేదన్నారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి స్వావలంబన భారత్ విజన్ను నిర్దేశించుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.
News September 23, 2025
సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం(ఫొటో)
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం