News June 18, 2024
ఆస్తులను విక్రయించనున్న ఎల్ఐసీ?

నిధులు సమకూర్చుకునేందుకు ఎల్ఐసీ తన భూములు, భవనాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ముంబైతో మొదలుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులను విక్రయించే అవకాశం ఉంది. దీని ద్వారా $6-7 బిలియన్లు సేకరించాలని సంస్థ భావిస్తోందట. ప్రైవేట్ సంస్థలకు దీటుగా మార్కెట్ షేర్ కాపాడుకునేందుకు LIC శ్రమిస్తున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు టైర్-2,3 ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు సంస్థ కృషి చేస్తోంది.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


