News October 19, 2024

మార్స్ మంచు కింద జీవం ఉండొచ్చు: నాసా

image

అంగారకుడిపై మంచు ఫలకాల కింద సూక్ష్మ జీవుల ఉనికి ఉండొచ్చని నాసా అంచనా వేసింది. భూమిపైనా అలాంటి ప్రాంతాలున్నాయని పేర్కొంది. ‘మంచు ఫలకాల కింద ఉన్న నీటికి సూర్యరశ్మి తగిలితే ఫోటోసింథసిస్ కారణంగా సూక్ష్మస్థాయిలో జీవం ప్రాణం పోసుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్స్‌పై అలాంటి చోట్లే జీవం గురించి అన్వేషించాలి. భూమిపై ఆ ప్రాంతాలను క్రయోకొనైట్ రంధ్రాలుగా పేర్కొంటాం’ అని వివరించింది.

Similar News

News October 19, 2024

జనసేనతో క్షేత్రస్థాయిలో సమస్యలు.. చంద్రబాబుతో ఎమ్మెల్యేలు

image

AP: TDP ప్రజాప్రతినిధులతో CM చంద్రబాబు సమావేశంలో పలువురు MLAలు జనసేన తీరుపై ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో జనసేనతో సమస్యలు వస్తున్నాయని, ఆ పార్టీ నేతలు సహకరించడం లేదని గౌతు శిరీషతోపాటు ముగ్గురు MLAలు ప్రస్తావించారు. అలాంటి సమస్యలను TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తుందని CM చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.

News October 19, 2024

ITI ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

TG: ఐటీఐ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. వివిధ ట్రేడ్లలో చేరేందుకు 8, 10వ తరగతి పాసై, 1-8-2024 నాటికి 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని చెప్పారు. గత కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వివరాల కోసం <>https://iti.telangana.gov.in<<>>/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 19, 2024

రాష్ట్రానికి మరో వాయు‘గండం’

image

AP: బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కాగా ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.