News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Similar News
News November 1, 2025
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు

AP: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమాయకులు చనిపోయారని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటివి జరుగుతున్నాయని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
News November 1, 2025
ప్రైవేటు ఆలయాల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు..

కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనతో ప్రైవేటు ఆలయాల నిర్వహణ తీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భక్తి, గుర్తింపు తదితర కారణాలతో ఇటీవల కొందరు భారీ స్థాయిలో గుళ్లు కడుతున్నారు. భారీ, ఆకట్టుకునే నిర్మాణం, విగ్రహాలు, లైటింగ్ ఎఫెక్ట్స్పై సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలు విపరీతంగా వెళ్తున్నారు. ప్రైవేటు నిర్వహణలోని ఆ ఆలయాల్లో ఇలాంటి దుర్ఘటన జరిగితే నష్ట నివారణ చర్యలున్నాయా? లేదా? ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలి.
News November 1, 2025
తప్పెవరిది? మూల్యం చెల్లించేదెవరు?

AP: కర్నూలు బస్సు ప్రమాదం(19 మంది మృతి) మరువకముందే శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ 2 ఘటనల్లోనూ నిర్వాహకుల నిర్లక్ష్యం సామాన్యులకు యమపాశంగా మారింది. తాజా దుర్ఘటనలో ఆలయం గురించి విపరీతమైన ప్రచారం, సౌకర్యాల లేమి 10 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పులకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి బాధాకరం. ఇలాంటివి జరగకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.


