News June 12, 2024

రాముడికి హనుమంతుడిలా..

image

2019లో ఒకే ఒక జనసేన MLA గెలిచారు. కొన్నాళ్లకు ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో జనసేన బలం శూన్యమైనట్లయింది. ఇక మునిగే పడవలాంటి ఆ పార్టీలో ఎవరూ ఉండరని, అంతకుముందు ఏడాదే పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరమవుతారనే భావన చాలామందిలో కలిగింది. ఆయన మాత్రం అలా చేయలేదు. రాముడికి హనుమంతుడిలా పవన్ కళ్యాణ్‌ వెంటే ఉన్నారు. నిజాయితీని నిరూపించుకున్నారు. ఈరోజు తెనాలి MLAగా మంత్రి పదవి అందుకున్నారు.

Similar News

News November 21, 2025

మహిషి కన్నీరు కలిసిన జలం

image

శబరిమల యాత్రలో ముఖ్య ప్రాంతాల్లో ‘అళుదా నది’ ఒకటి. మహిషిని అయ్యప్ప స్వామి వధించిన స్థలం ఇదేనని ప్రతీతి. స్వామి బాణాలకు తాళలేక మహిషి రోదిస్తూ కన్నుమూశాడు. అప్పుడు కార్చిన కన్నీరు ఈ నదిలో కలిసిందట. అందుకే దీన్ని అళుదా(రోదించడం) నది అని అంటారు. అయ్యప్ప భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, 2 రాళ్లను తీసుకొని, యాత్ర మార్గంలోని కల్లిడుకుండ్రుం వద్ద విసిరి తమ యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 21, 2025

యూనస్ టచ్ కూడా చేయలేడు: షేక్ హసీనా కొడుకు

image

బంగ్లాదేశ్‌లో రాజ్యాంగవిరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ అన్నారు. ‘యూనస్ నా తల్లిని చంపలేరు. కనీసం టచ్ కూడా చేయలేరు. బంగ్లాలో చట్టబద్ధమైన పాలన వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది’ అని చెప్పారు. 140 రోజుల్లోనే విచారణ పూర్తి చేశారని, న్యాయ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. హసీనాకు <<18311087>>మరణశిక్ష <<>>విధిస్తూ ICT తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

News November 21, 2025

లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-1

image

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బడా ఇన్వెస్టర్లు కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అద్దె/లీజుకు ఇస్తున్నారు. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటి వాటిని ఆభరణాల వ్యాపారులు, రిఫైనర్లు, తయారీదారులకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తద్వారా బంగారంపై 2-7% ఆదాయం పొందుతున్నారు. ఇటు ధరల పెరుగుదల, అటు లీజ్ ద్వారా లాభపడుతున్నారు.