News January 10, 2025
సంక్రాంతి బస్సులపై ఇక్కడిలా.. అక్కడలా!

సంక్రాంతికి APSRTC 7,200, TGSRTC 6,432 బస్సులు నడుపుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉండేలా చర్యలు తీసుకుంటామంది. అటు, TGSRTC స్పెషల్ సర్వీసుల్లో 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్వీసుల వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.
Similar News
News November 28, 2025
డ్రెస్సునో, లిప్స్టిక్నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్స్టిక్నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.
News November 28, 2025
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలి: CBN

AP: TDP పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం చంద్రబాబు ఎంపీలకు కీలక సూచనలు చేశారు. DEC 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలే ఎజెండాగా తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అంశాలను ప్రస్తావించాలని MPలకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలని, రైతు సమస్యల పరిష్కారం ముఖ్యమని CBN వివరించారు.
News November 28, 2025
అక్కడ మూడో తరగతి వరకు నో ఎగ్జామ్స్

జపాన్లోని విద్యా వ్యవస్థ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అక్కడ మూడో తరగతి వరకూ హోమ్వర్క్స్, ఎగ్జామ్స్, ర్యాంకులంటూ ఉండవు. నాలుగో తరగతి నుంచి అకడమిక్ వర్క్ మొదలవుతుంది. అక్కడ తొలి మూడేళ్లు వారికి బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, క్లాస్ రూమ్ను క్లీన్గా ఉంచుకోవడం, ఇతరులకు హెల్ప్ చేయడం వంటివి నేర్పుతారు. అదే ఇండియాలో నర్సరీ నుంచే పిల్లలు హోంవర్క్, పరీక్షలు, ర్యాంకుల ఒత్తిడిని ఎదుర్కొంటారు.


