News September 22, 2025
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్

TG: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. NOCకి అంగీకరిస్తున్నట్లు విష్ణుదేవ్ తెలిపారు. భూసేకరణ, నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
Similar News
News September 22, 2025
వయసు కాదు.. ధైర్యమే ముఖ్యం!

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపించారు 77 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోహన్ రాయ్. పుణేకు చెందిన సోహన్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ లాను అధిరోహించి ఔరా అనిపించారు. లద్దాక్లోని 19,024 అడుగుల ఎత్తైన ఈ ప్రాంతానికి ఆయన చేసిన ప్రయాణం సాహసానికి, సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఇక్కడి భిన్నమైన వాతావరణంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.
News September 22, 2025
యూరియాతో తీవ్ర నష్టం: సీఎం

AP: యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.
News September 22, 2025
INDvsPAK: మరోసారి ICCకి PCB ఫిర్యాదు!

భారత్, పాక్ మ్యాచ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ను <<17794224>>ఔట్గా<<>> ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించినట్లు సమాచారం. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాగా అంతకుముందు హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో రిఫరీ పైక్రాఫ్ట్పై PCB <<17717948>>ఫిర్యాదు<<>> చేసి భంగపడిన విషయం తెలిసిందే.