News March 17, 2024
లింగంపేట: పెళ్లికి వెళ్లొస్తున్న ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు.. నిజాంసాగర్ మండలం సింగితం, గున్కుల్, వడ్డెపల్లి నుంచి పలువురు కొర్పోల్లో పెళ్లికి వెళ్లారు. రిటన్లో 12 మందితో వస్తున్న ఆటో బాయంపల్లి శివారులో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో సంగయ్య, లావణ్య మృతి చెందారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
Similar News
News December 7, 2025
NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.
News December 7, 2025
NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

నిజామాబాద్ శివారులోని గూపన్పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.
News December 6, 2025
స్ట్రాంగ్ రూమ్ను తనిఖీ చేసిన NZB కలెక్టర్

NZB సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పంపిస్తున్న పోలింగ్ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. సామగ్రి తరలింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో సాయగౌడ్ పాల్గొన్నారు.


