News April 1, 2025

నేటి నుంచి ఆ ప్రాంతాల్లో లిక్కర్ బ్యాన్

image

మధ్యప్రదేశ్‌లోని 19 ఆధ్యాత్మిక నగరాలు, పంచాయతీల్లో నేటి నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. JANలోనే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, అమర్‌కంటక్, మాండ్లేశ్వర్, చిత్రకూట్, పన్నా, మాండ్ల, ముల్తాయ్, మాండసోర్, ఓర్ఛా, మైహర్, దతియా నగరాలు సహా పలు
జీపీల్లో మద్యం షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

BREAKING: మయన్మార్‌లో మరోసారి భూకంపం

image

వరుస భూకంపాలు మయన్మార్ ప్రజలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మయన్మార్‌లో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. 4.15pmకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. గత నెల 28న సంభవించిన భారీ భూకంపానికి ఇప్పటివరకూ 2,700 మందికి పైగా చనిపోగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు.

News April 2, 2025

ధోనీ ఔట్‌పై రియాక్షన్ వైరల్.. ఫ్యాన్ గర్ల్ ఏమన్నారంటే?

image

IPL: RR vs CSK మ్యాచ్‌లో ధోనీ ఔటైన సమయంలో ఓ ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఆమె పేరు ఆర్యప్రియా భుయాన్. గువాహటికి చెందిన ఈ 19 ఏళ్ల యువతి ఆ రియాక్షన్‌పై తాజాగా స్పందించారు. ‘CSKకు సపోర్ట్ చేసేందుకు ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వెళ్లాను. ధోనీ ఔటవడంతో అనుకోకుండా అలా రియాక్ట్ అయ్యాను. టీవీలో కనిపించిన విషయం నాకు తెలియదు. తర్వాత ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది’ అని పేర్కొన్నారు.

News April 2, 2025

ఎకరానికి రూ.31,000: మంత్రి ప్రకటన

image

AP: రిలయన్స్ <<15966046>>CBG ప్లాంట్లతో<<>> ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా బంజరు భూములు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31వేలు కౌలు చెల్లిస్తామన్నారు. కందుకూరులో ఇండోసోల్ ప్లాంట్, BPCL అందుబాటులోకి రానున్నాయన్నారు.

error: Content is protected !!