News November 15, 2024
లిక్కర్ బ్యాన్ కొత్త తరహా నేరాలకు కారణమైంది: పట్నా హైకోర్ట్

బిహార్లో అమలవుతున్న మద్యపాన నిషేధంపై పట్నా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కొత్త తరహా నేరానికి కారణమవుతోందని, కొందరికి వరంలా మారిందని వ్యాఖ్యానించింది. మంచి ఉద్దేశంలో అమలు చేస్తున్న లిక్కర్ బ్యాన్ కొందరు తాము లాభపడేందుకు మద్దతిచ్చారని పేర్కొంది. ముకేశ్ కుమార్ పాశ్వన్ అనే పోలీసును లిక్కర్ వ్యవహారంలో డిమోట్ చేయగా, అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు పైవిధంగా స్పందించింది.
Similar News
News November 13, 2025
రోడ్లకు నేతల పేర్లకు బదులు కంపెనీల పేర్లు: సీఎం

TG: దేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉన్నాయని, హైదరాబాద్లో తాము ఆ ట్రెండ్ను మార్చాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని అన్నారు. ఢిల్లీలో జరిగిన US-India సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.
News November 13, 2025
సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్సైట్: scclmines.com
News November 13, 2025
ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.


