News November 16, 2024
మద్యం MRP రూ.120, అమ్మేది రూ.130: YCP

AP: ఇసుకలో దోచేశారని, ఇప్పుడు మద్యంలో స్టార్ట్ చేశారా? అని ప్రభుత్వాన్ని YCP Xలో ప్రశ్నించింది. మద్యం MRP రూ.120 అయితే రూ.130కి అమ్ముతూ కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించింది. ప్రభుత్వం చేతుల్లోంచి ప్రైవేటుకు మద్యం దుకాణాలు అప్పగించి దందా చేస్తున్నారని, ఎవరూ టెండర్ల వేయకుండా దౌర్జన్యం చేశారని మాజీ CM జగన్ ఆరోపించినట్లు పేర్కొంది. ‘మీ వాళ్లకి ఇంకెంత దోచిపెడతావ్ CBN’ అంటూ ప్రశ్నించింది.
Similar News
News December 28, 2025
బ్యాడ్మింటన్లో గోల్డ్ సాధించిన చరిష్మ.. CBN, లోకేశ్ అభినందనలు

AP: విజయవాడలో జరిగిన 87వ యోనెక్స్ సన్రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2025 ఉమెన్స్ సింగిల్స్లో రాష్ట్రానికి చెందిన సూర్య చరిష్మ తమిరి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రా జట్టు సిల్వర్ గెలిచింది. తొలి గోల్డ్ మెడల్ సాధించిన చరిష్మ, సిల్వర్ గెలిచిన టీమ్ను CM చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
News December 28, 2025
సీఎం రేవంత్ కీలక సమీక్ష.. వ్యూహం సిద్ధం!

TG: అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో CM రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో నదీజలాల పంపకం, TG వాటా, APతో వివాదాలు, BRS హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
News December 28, 2025
ట్రైలర్ ఏది ‘రాజాసాబ్’?

నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తీరా చివరివరకు వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈవెంట్ చివర్లో ట్రైలర్ రేపు వస్తుందని ప్రభాస్ అనౌన్స్ చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


