News February 25, 2025
లిక్కర్ పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం: ఢిల్లీ సీఎం

ఆప్ సర్కార్ 2021-22లో తెచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. లిక్కర్ వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకోవడం కోసం తెచ్చిన ఈ విధానం దాని లక్ష్యాలను అందుకోలేకపోయిందని పేర్కొన్నారు. లైసెన్సుల జారీలో నిబంధనలను ఉల్లంఘించారని, నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదని వివరించారు.
Similar News
News November 22, 2025
MBNR: పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల

ఉమ్మడి MBNR జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో బీఎడ్, ఎం.ఫార్మసీ, బీపీఎడ్, ఎల్ఎల్బీ కోర్సుల <<18361783>>ఫలితాలను<<>> వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN.శ్రీనివాస్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.అనురాధ రెడ్డి, ఆకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.చంద్రకిరణ్, పీజీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News November 22, 2025
MBNR: పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల

ఉమ్మడి MBNR జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో బీఎడ్, ఎం.ఫార్మసీ, బీపీఎడ్, ఎల్ఎల్బీ కోర్సుల <<18361783>>ఫలితాలను<<>> వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN.శ్రీనివాస్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.అనురాధ రెడ్డి, ఆకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.చంద్రకిరణ్, పీజీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News November 22, 2025
బైజూస్కు షాక్.. రూ.8,900 కోట్లు చెల్లించాలని తీర్పు

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ రూ.8,900 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే డెలావేర్లోని దివాలా కోర్టు భారీ ఫైన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. బైజూస్ ఆల్ఫా నెలకొల్పి 1 బిలియన్ లోన్ పొందారని, రూల్స్ అతిక్రమించి 533 మిలియన్ డాలర్లను తరలించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు.


