News February 25, 2025

లిక్కర్ పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం: ఢిల్లీ సీఎం

image

ఆప్ సర్కార్ 2021-22లో తెచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. లిక్కర్ వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకోవడం కోసం తెచ్చిన ఈ విధానం దాని లక్ష్యాలను అందుకోలేకపోయిందని పేర్కొన్నారు. లైసెన్సుల జారీలో నిబంధనలను ఉల్లంఘించారని, నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదని వివరించారు.

Similar News

News December 8, 2025

అఖండ-2 రిలీజ్ ఎప్పుడు?

image

అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాలకృష్ణ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. DEC 12న ఎట్టిపరిస్థితుల్లోనూ మూవీ విడుదల చేయాల్సిందేనని SMలో డిమాండ్ చేస్తున్నారు. #WeWantAkhanda2OnDec12th హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కొందరైతే నిర్మాతలకు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ శుక్రవారమే రిలీజ్ ఉండే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు బీజేపీ మద్దతు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

News December 7, 2025

బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

image

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్‌ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్‌తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.