News December 21, 2024

ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు

image

ఏపీలో మందుబాబులకు మంచి కిక్కిచ్చే న్యూస్. 11 మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో క్వార్టర్‌పై రూ.30, ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.90-120 వరకు ధరలు తగ్గాయి. మాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ సహా పలు బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. త్వరలోనే న్యూఇయర్, సంక్రాంతి పండుగలు రానుండటంతో ధరల తగ్గింపుపై మందుబాబులు సంబరపడుతున్నారు.

Similar News

News December 24, 2025

‘ఐయామ్ సారీ అమ్మా’.. డిగ్రీ విద్యార్థిని సూసైడ్

image

TG: ఏడేళ్ల క్రితం తండ్రి మరణం, తాజాగా తల్లికి అనారోగ్యం.. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఖమ్మం(D) కవిరాజు నగర్‌లో విద్యార్థిని సృజన(18) సూసైడ్ చేసుకుంది. అనారోగ్యానికి గురైన అమ్మ బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. భవిష్యత్తుపై బెంగతో మానసికంగా కుంగిపోయిన యువతి ‘ఐయామ్ సారీ అమ్మా’ అంటూ ఫొటోపై నోట్ రాసి నిన్న అఘాయిత్యానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

News December 24, 2025

2028లోనే ప్రజలు కాంగ్రెస్‌ను బొంద పెడుతారు: KTR

image

TG: పనికిమాలిన <<18660605>>శపథాలు<<>> చేయడం, పత్తాలేకుండా పారిపోవడం రేవంత్‌కు అలవాటని BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి పనిచేయవు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం. మళ్లీ వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం. మేము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు. రైతన్న హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం’ అని Xలో ఫైరయ్యారు.

News December 24, 2025

‘భారత్ నీళ్లు ఆపేస్తోంది’.. పాక్ ఆరోపణల్లో నిజమెంత?

image

వాతావరణ పరిస్థితులు, మంచు కరగడం, డ్యామ్ కార్యకలాపాలు సహా పలు అంశాలపై నీటి ప్రవాహ వేగం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నీటిని నిలిపేసి, ఒకేసారి విడుదల చేస్తూ IND ఇబ్బంది <<18651568>>పెడుతోందని<<>> PAK చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండస్ వాటర్ ఒప్పందాన్ని IND రద్దు చేసింది. దీంతో తాము నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని PAK అంటోంది.