News June 22, 2024
Xలో లైవ్ స్ట్రీమ్.. త్వరలో కొత్త రూల్
X(ట్విటర్)లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ కలిగిన యూజర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్ను ప్రారంభించేలా కొత్త నిబంధన రానుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం Xలో బేసిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధర నెలకు ₹215తో ప్రారంభమవుతోంది. కమర్షియల్ యాడ్స్ నుంచి ఆదాయం తగ్గడంతో సబ్స్క్రైబర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆ సంస్థ ఓనర్ మస్క్ భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 9, 2024
వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి
TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
News October 9, 2024
నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు
తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.
News October 9, 2024
నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి
AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.