News August 1, 2024
సెప్టెంబర్ 1 నుంచి పశుగణన

దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా కేంద్రం శ్రీకారం చుట్టిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వీపీ సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి నాలుగు నెలలపాటు పశుగణన చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోని దాదాపు 6.6 లక్షల గ్రామాల్లో 30 కోట్ల పశుపెంపకందార్ల నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు. పశురంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.
News December 9, 2025
IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

<


