News August 31, 2024
రాష్ట్రంలో రేపటి నుంచి పశుగణన

TG: రాష్ట్రంలో 21వ జాతీయ పశుగణన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పశువులు, గొర్రెలు, మేకల వివరాలను ఆన్ లైన్ చేయనున్నారు. చివరిసారిగా 2019లో జరిగిన లెక్కింపులో 3.26 కోట్ల జీవాలు నమోదయ్యాయి. వీటితో పాటు పౌల్ట్రీలో 7.99 కోట్లు ఉన్నట్లు తేలింది.
Similar News
News March 10, 2026
T20WC గెలుపు.. పెళ్లికి సిద్ధమైన భారత క్రికెటర్

T20WC గెలుపు సంతోషంలో ఉన్న భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ పెళ్లికి సిద్ధమయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఈ నెల 14న ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఏడడుగులు వేయనున్నారు. మార్చి 17న లక్నోలో రిసెప్షన్ జరగనుంది. వీరికి గతేడాది జూన్ 4న ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. నవంబర్లో మ్యారేజ్ జరగాల్సి ఉండగా T20WC ప్రిపరేషన్స్ కోసం కుల్దీప్ వాయిదా వేశారు.
News March 10, 2026
GREAT: కష్టకాలంలో భారతీయులకు అండగా..

యుద్ధం కారణంగా విమానాలు నిలిచిపోయి దుబాయ్లో ఇబ్బంది పడుతున్న భారతీయులకు అండగా నిలిచారు ఇండియన్ బిజినెస్మెన్ యోగేష్ దోషి. హోటల్ ఖర్చులను భరించలేని సుమారు 125 మంది ప్రయాణికుల కోసం తన 64 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ భవనాన్ని కేటాయించారు. వారికి ఉచిత వసతితో పాటు ఆహారం, వైద్య సదుపాయాలను కూడా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈయనపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
News March 10, 2026
NITTTRలో ఉద్యోగాలు.. ఈనెల 13 వరకు గడువు

చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR)12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. MTS పోస్టుకు 35ఏళ్లు. వెబ్సైట్: https://www.nitttrc.ac.in


