News August 31, 2024
రాష్ట్రంలో రేపటి నుంచి పశుగణన

TG: రాష్ట్రంలో 21వ జాతీయ పశుగణన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పశువులు, గొర్రెలు, మేకల వివరాలను ఆన్ లైన్ చేయనున్నారు. చివరిసారిగా 2019లో జరిగిన లెక్కింపులో 3.26 కోట్ల జీవాలు నమోదయ్యాయి. వీటితో పాటు పౌల్ట్రీలో 7.99 కోట్లు ఉన్నట్లు తేలింది.
Similar News
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News March 3, 2026
చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న పవన్కు సీఎం స్వాగతం పలికారు. ఆపై ఇరువురూ సమావేశమయ్యారు. టీటీడీ అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది. అలాగే తన శాఖలకు సంబంధించిన అంశాలపైనా పవన్ చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు సమాచారం.


