News November 2, 2024
తెలంగాణలో భారీగా పెరిగిన పశుసంపద

TG: రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో పశుసంపద భారీగా పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ పేర్కొంది. దాదాపు రూ.2వేల కోట్ల వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. గుడ్ల ఉత్పత్తి రెట్టింపు కాగా మాంసం ఉత్పత్తిలోనూ గణనీయమైన అభివృద్ధి జరిగిందని వివరించింది. పశుసంపద, పాలు, గుడ్లు, మాంస ఉత్పత్తుల విలువ 2014-15లో రూ.2,824.57కోట్లు ఉండగా 2022-23 నాటికి అది రూ.4,789.09కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.
Similar News
News November 6, 2025
నైట్ స్కిన్ కేర్ ఇలా..

పగలంతా అలసిపోయిన చర్మం రాత్రివేళ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్ చెయ్యాలన్నా ఇదే సరైన సమయం. ఇందుకోసం యాంటీఆక్సిడెంట్స్ ఉన్న నైట్ క్రీమ్ అప్లై చేయాలి. ఇవి వయసుని పెంచే ఫ్రీరాడికల్స్తో పోరాడతాయి. కళ్ల కింద ఉబ్బు వస్తుంటే కెఫీన్ ఉన్న ఐక్రీమ్స్ అప్లై చెయ్యాలి. వాజిలీన్/ కొబ్బరి నూనెను చేతులకు, పాదాలకు అప్లై చేసి గ్లౌవ్స్, సాక్స్ వేసుకుని పడుకుంటే ఉదయానికి మృదువుగా మారతాయి.
News November 6, 2025
చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.
News November 6, 2025
దేశంలో అత్యంత పురాతనమైన శివలింగం!

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం గురించి తెలుసుకుందాం. తిరుపతి(D) గుడిమల్లం పరశురామేశ్వరాలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ ఆలయం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదని, ఆలయంలోని శివలింగం సుమారు 2,300 ఏళ్లనాటిదని అంచనా వేశారు. ఇక్కడి లింగం సాధారణ రూపంలో కాకుండా, మానవ రూపంలో (వేటగాడి రూపం) రాక్షసుడి భుజాలపై నిలబడినట్లు ఉంటుంది.


