News October 17, 2024
మూసీ పరీవాహకంలో దుర్భర జీవితం గడుపుతున్నారు: రేవంత్

TG: రాష్ట్ర భవిష్యత్ను నిర్దేశించే ‘మూసీ’ ప్రాజెక్ట్ను ప్రభుత్వం చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘33 బృందాలు మూసీ పరీవాహకంపై అధ్యయనం చేశాయి. అక్కడ నివసిస్తున్నవారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వారికి మెరుగైన జీవితం అందించాలని మేం భావిస్తున్నాం. విద్యావంతుల నుంచి నిరక్షరాస్యుల వరకు అందరికీ హైదరాబాద్ ఉపాధి కల్పించాలి అన్నదే మా లక్ష్యం’ అని మూసీ ప్రాజెక్ట్ ప్రణాళిక సందర్భంగా అన్నారు.
Similar News
News November 18, 2025
17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

ఎన్కౌంటర్లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.
News November 18, 2025
17 ఏళ్ల వయసులోనే దళంలోకి..

ఎన్కౌంటర్లో మృతి చెందిన <<18318593>>హిడ్మా<<>> గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోలు నడిపే స్కూళ్లో చదివి, 1996-97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు. ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా మారాడు.
News November 18, 2025
నారద, తుంబురులు కాదు.. ‘హనుమంతుడు’

ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో అని నారద, తుంబురుల మధ్య ఓనాడు వివాదం ఏర్పడింది. దీంతో హనుమంతుడి దగ్గరకు వెళ్లారు. ‘నాకు రామభక్తి తప్ప ఇంకేం తెలీదు. ఆయన గానమే చేస్తా’ అని కీర్తనలు చేయడం మొదలుపెట్టాడు. ఆ గానానికి శిలలు కరిగిపోయాయి. నారద, తుంబురుల వాయిద్యాలు అందులో కలిసిపోయాయి. ఆ తర్వాత వారు కూడా గానం చేశారు. కానీ, ఏ శిలా కరగలేదు. దీంతో హనుమే గొప్పవాడని తెలుసుకొని, అణిగిన గర్వంతో వెనక్కి వెళ్లిపోయారు.


