News July 10, 2024

బల్లిపడిన టిఫిన్లు.. చిట్టెలుకలు తిరిగే చట్నీలు: కేటీఆర్

image

TG: ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారని KTR విమర్శించారు. JNTU హాస్టల్ చట్నీలో ఎలుక పడిన ఘటనపై ఆయన స్పందించారు. ‘మొన్న భువనగిరిలో కలుషిత ఆహారం. నిన్న కోమటిపల్లిలో ఉప్మాలో బల్లి. ఇప్పుడు చట్నీలో ఎలుక. ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటే పెద్ద మార్పే తెచ్చారు. ఇకనైనా సర్కారు కళ్లు తెరవాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 8, 2025

కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

image

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.

News November 8, 2025

ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

image

డిజిటల్, ఆన్‌లైన్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.

News November 8, 2025

ఆ MLAలు ఏం చేస్తున్నట్లు?

image

AP: CM <<18235116>>తాజా వ్యాఖ్యల<<>>తో ఆ ‘48మంది MLAలు’ ఎవరు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నెలలో ఒకట్రెండు రోజుల పాటు పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలోనూ పాల్గొనలేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగే నేతలు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్లు? అని నిలదీస్తున్నారు. అయితే MLAలపై చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? అని అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.