News August 26, 2024
రూ.2లక్షలకు పైబడి రుణమాఫీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: రూ.2లక్షలకు పైన రుణమాఫీపై ముందడుగు పడింది. అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఇప్పటివరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టత నివ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులకు అవకాశం లభించింది. అయితే వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది ప్రభుత్వం వెల్లడించలేదు.
Similar News
News December 28, 2025
ధోనీతో ఆడటం నా అదృష్టం: డుప్లెసిస్

CSKలో MS ధోనీ, స్టీఫెన్ ఫ్లేమింగ్ వంటి గొప్ప ప్లేయర్ల ఆధ్వర్యంలో ఆడటం తన అదృష్టమని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నారు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. CSKలో పదేళ్లు, JSKలో మూడేళ్లు ఆడానని, ఇదో గొప్ప ఫ్రాంచైజీ అని అన్నారు. ఇటీవల IPLకు డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం సౌతాఫ్రికా T20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నారు.
News December 28, 2025
శబరిమల ఆలయం మూసివేత.. రీఓపెన్ ఎప్పుడంటే?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజా కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న 5PMకు ఆలయం తెరుస్తామని చెప్పింది. మరోవైపు ఇప్పటిదాకా 30 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ₹333 కోట్ల ఆదాయం టెంపుల్కు వచ్చింది.
News December 28, 2025
ఉక్రెయిన్ ఒప్పుకోకున్నా మా ‘లక్ష్యం’ సాధిస్తాం: పుతిన్

రెండు దేశాల మధ్య వివాదాన్ని శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ త్వరపడటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఇందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యేక సైనిక చర్య ద్వారా బలవంతంగానైనా అన్ని లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు. 500 డ్రోన్లు, 40 మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కమాండ్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా సైనిక దుస్తుల్లో పుతిన్ కనిపించారు.


