News August 15, 2024
రేపు ఖాతాల్లోకి రూ.2 లక్షల వరకు రుణమాఫీ డబ్బులు: భట్టి

TG: రేపు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు రూ.2 లక్షలు జమ అవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వైరా సభలో ఆయన చెప్పారు. కాగా మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో రూ.లక్షన్నర వరకు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. రేపు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు మాఫీ కానుంది.
Similar News
News July 8, 2025
ఆమెతో ఇప్పటికే పెళ్లయిపోయింది: ఆమిర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రాట్తో మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఆమెతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా బంధం పట్ల గౌరీ, నేనూ సీరియస్గా ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యాం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నా. అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలో త్వరలో నిర్ణయించుకుంటాం’ అని తెలిపారు.
News July 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 8, 2025
US కొత్త చట్టం.. పెరగనున్న వీసా ఫీజులు

US ప్రెసిడెంట్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’తో వీసా ఫీజులు పెరగనున్నాయి. నాన్ ఇమిగ్రెంట్లు తప్పనిసరిగా వీసా జారీ సమయంలో ఇంటిగ్రిటీ ఫీజు కింద $250 చెల్లించాలి. భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా ఇది పెరగొచ్చు. 2026 నుంచి కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ మొత్తం ఏటా పెరుగుతూ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం లేదా రద్దు చేయడానికి వీలుండదు.