News August 8, 2024
రూ.9.90 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్

గత ఐదేళ్లలో బ్యాంకులు రూ.9.90 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్టు కేంద్రం నిన్న రాజ్యసభలో వెల్లడించింది. రైటాఫ్ చేసినంత మాత్రానా రుణాలను పూర్తిగా రద్దు చేసినట్టు కాదని, లోన్లు తీసుకున్న వారు వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోంది. బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడానికి, పన్ను ప్రయోజనాలు పొందడానికి బ్యాంకులు రుణాలను రైటాఫ్ చేస్తుంటాయని వివరించింది.
Similar News
News March 26, 2026
యుద్ధం.. భారత్పై ఇరాన్ ఒత్తిడి!

యుద్ధం వల్ల దౌత్యపరంగా భారత్పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. US, ఇజ్రాయెల్ దాడులను BRICS కూటమి ఖండించేలా చర్యలు తీసుకోవాలని భారత్ను ఇరాన్ కోరినట్లు సమాచారం. అయితే కూటమిలో ఇరాన్ ప్రత్యర్థులైన సౌదీ – UAE ఉండటం, అమెరికా-ఇజ్రాయెల్ కూడా మిత్రపక్షాలే కావడం భారత్కు సవాల్గా మారింది. దీంతో ఈ ఏడాది BRICSకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
News March 26, 2026
మార్కాపురం ప్రమాదం.. మొండి కత్తితో 8 మందిని కాపాడాడు

AP: మార్కాపురం <<19479058>>బస్సు ప్రమాద ఘటన<<>>లో ఓ వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. బస్సులో మంటలు చెలరేగగానే అక్కడే ఉన్న మొండికత్తితో అద్దాలు పగలగొట్టి ఎనిమిది మందిని బయటకు తోసేశారు. తర్వాత తాను కూడా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయానని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.
News March 26, 2026
బ్రెయిన్లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.


