News October 7, 2024
కౌలు రైతులకు రుణాలు: మంత్రి అచ్చెన్న

AP: కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇటీవల పరిహారం ఇచ్చామని, కౌలు రైతులకు నేరుగా పరిహారం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు. ప్రాంతీయ సదస్సుల ద్వారా అభిప్రాయాలు తీసుకొని కౌలు చట్టం రూపకల్పన చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన కౌలు చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోండి: ఎంపీ

జిల్లాలో కొబ్బరి రైతులను ఆదుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ శుక్రవారం పార్లమెంటులో కోరారు. జిల్లాలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కొబ్బరి పంట వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు జీవనోపాధిని నిలబెట్టే సాంస్కృతిక, ఆర్థిక ఆధారాలని ఎంపీ తెలిపారు.
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.


