News February 8, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. 10న ఓటర్ల జాబితా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738976046534_695-normal-WIFI.webp)
TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 5,817 MPTC, 570 ZPTC స్థానాల్లోని ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే ఆయా స్థానాల పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వివరాలతో 11న డ్రాఫ్ట్ ప్రకటించాలని ఆదేశించింది. 12, 13న అభ్యంతరాలు స్వీకరించి, 15న తుది జాబితా రిలీజ్ చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి ఈనెల 15లోగా శిక్షణ <<15393143>>పూర్తిచేయాలంది.<<>>
Similar News
News February 8, 2025
ముస్లింల ప్రాంతంలో ఆప్ ముందంజ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738984234790_782-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్ ఆధిపత్యం కనబరుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. దీంతో ముస్లిం ప్రాంతాలల్లో ఆప్ పట్టు నిలుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్గా బీజేపీ 30 చోట్ల, ఆప్ 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక చోట లీడింగ్లో ఉంది.
News February 8, 2025
1956-93 మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎందుకు లేదు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738981085860_695-normal-WIFI.webp)
1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 NOV 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి UTగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, LG నామినేటెడ్ మెంబర్స్ ఐదుగురు ఉండేవారు. అయితే వీరికి శాసనాధికారాలు లేవు. 1991లో 69వ సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది.
News February 8, 2025
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738983864442_782-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఆప్ 10 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానానికే పరిమితమైంది.