News June 2, 2024

లోకల్ సర్వేలు మాకే అనుకూలం: సజ్జల

image

AP: ఎగ్జిట్ పోల్స్‌లో లోకల్ సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ సర్వేలు మాత్రమే కూటమికి ఆధిక్యం చూపిస్తున్నాయన్నారు. ‘ఎగ్జిల్ పోల్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయి. మాకు సైలెంట్ ఓట్లు పడ్డాయి. ప్రజలంతా YCP వెంటే ఉన్నారు. కూటమి నేతలు కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News October 15, 2025

తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళిక

image

AP: శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఘాట్ రోడ్ విస్తరణ, భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. 3 దశల్లో డెవలప్‌‌మెంట్ పనులకు దాదాపు 4,900 ఎకరాల అటవీ భూములు అవసరం కానున్నాయి. ఈనెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఈ భూములపై నివేదిక అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

News October 15, 2025

బియ్యప్పిండితో బ్యూటీ

image

విటమిన్-బి అధికంగా ఉండే బియ్యం చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పిండితో చేసే బ్యూటీ మాస్క్‌లేంటో చూద్దాం. * స్పూన్ బియ్యం పిండి, ఎగ్ వైట్ వేసి కలపాలి. ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. * టమాటా రసం, గోధుమపిండి, బియ్యంపిండి కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

News October 15, 2025

కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

image

TG: తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను ప్రభుత్వం తొలగించింది. మంత్రుల మధ్య విభేదాలకు కారణమయ్యేలా సమాచారాన్ని లీక్ చేస్తున్నారని, మేడారం పనుల టెండర్లలోనూ గోల్‌మాల్‌కు యత్నించారని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. సెటిల్మెంట్లు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తీవ్రంగా స్పందించిన CM రేవంత్ ఆయనను తొలగించాలని నేరుగా ఆదేశించినట్లు సమాచారం.