News March 17, 2024
లోక్ సభ పోరు.. NGKL కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహబూబ్ నగర్ పరిధిలో BRS, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. అటూ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి తేలాల్సి ఉంది. ఇక్కడ BRS, కాంగ్రెస్ అభ్యర్థులపై స్పష్టత వస్తే ప్రచారం ఊపందుకోనుంది.
Similar News
News August 17, 2025
పాలమూరు: ALERT.. దూరవిద్యకు రేపే లాస్ట్..!

ఈ ఏడాదికి గాను ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తుల గడువు రేపటితో ముగుస్తుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, SSCకి 14 సం||లు, INTERకి 15 సం||ల కనీస వయసు ఉండాలన్నారు. అడ్మిషన్ అయిన వారికి ఉచిత పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తామని, ఉమ్మడి జిల్లాలో SSC- 81, INTER- 107 సెంటర్లు ఉన్నాయన్నారు.
News August 17, 2025
ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాలలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. నవాబుపేట 33.5, మిడ్జిల్ 28.0, భూత్పూర్ 16.3, కోయిలకొండ మండలం పారుపల్లి 13.0, నవాబుపేట 12.8, మహబూబ్నగర్ అర్బన్ 10.8, హన్వాడ 10.0, రాజాపూర్ 8.3, మహమ్మదాబాద్ 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
News August 17, 2025
MBNR: 24 గంటల్లో నమోదైన వర్షపాతం

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా మిడ్జిల్ మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యల్పంగా బాలానగర్ మండలంలో 0.3 మి.మీ వర్షపాతం కురిసింది. కౌకుంట్ల చిన్న చింతకుంట రాజాపూర్ మహమ్మదాబాద్ మండలాలలో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. నేడు రేపు కూడా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.