News August 29, 2024

విశాఖ కోర్టుకు హాజరైన లోకేశ్

image

AP: ‘సాక్షి’ పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. గతంలో ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ పేరుతో సాక్షి పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై లోకేశ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇవాళ విచారణకు రావడంతో ఆయన కోర్టుకు వెళ్లారు.

Similar News

News October 25, 2025

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పలు మార్పుల తర్వాత ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 25, 2025

ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఐఐటీ బాంబే 53 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply

News October 25, 2025

త్వరలో వెండిపైనా రుణాలు!

image

బంగారం మాదిరే వెండిపైనా బ్యాంకుల్లో లోన్లు తీసుకొనే అవకాశం తొందర్లోనే అందుబాటులోకి రానుంది. 2026 APR 1 నుంచి కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంకులు, NBFCలు, ఫినాన్స్ కంపెనీలు రుణం ఇచ్చేలా RBI గైడ్ లైన్స్ ఇచ్చింది. రూ.2.5లక్షల వరకు తీసుకునే రుణానికి వెండి మార్కెట్ విలువలో 85%, రూ2.5-రూ.5లక్షల మధ్య రుణానికి 80%, ఆపై 75% రుణం పొందొచ్చు. ఓ వ్యక్తి గరిష్ఠంగా 10KGల వరకు వెండిని హామీగా ఉంచి లోన్ తీసుకోవచ్చు.