News September 10, 2025

అనంతపురం సభకు లోకేశ్ దూరం

image

AP: అనంతపురంలో ఇవాళ జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభకు మంత్రి నారా లోకేశ్ గైర్హాజరు కానున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు ఆయనకు అప్పగించారు. దీంతో లోకేశ్ వెలగపూడిలోని సచివాలయంలో కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఏపీ వాసులను క్షేమంగా రప్పించేందుకు కేంద్ర మంత్రులు, అధికారులతో సమన్వయం చేయనున్నారు.

Similar News

News September 10, 2025

రేపే లాస్ట్.. టెన్త్ అర్హతతో 2,418 ఉద్యోగాలు

image

సెంట్రల్ రైల్వేలో 2,418 అప్రెంటీస్ పోస్టుల దరఖాస్తుకు రేపే చివరి తేదీ. ఫిట్టర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు టెన్త్/ఐటీఐలో 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రూ.100 ఫీజు చెల్లించి https://rrccr.com/ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 10, 2025

కార్మికుల పిల్లలకు రూ.25,000 వరకు స్కాలర్‌షిప్

image

కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు చదువును బట్టి రూ.25,000 వరకు ఏటా<> స్కాలర్ షిప్ <<>>అందిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న <<-se_10012>>విద్యార్థులు<<>> ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు అక్టోబర్ 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://scholarships.gov.in/

News September 10, 2025

తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ: జగన్

image

AP: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని మాజీ CM జగన్ విమర్శించారు. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ ప్రయోజనాలు దోపిడీదారులకు అందుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. శాంతిభద్రతలు కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా’ అని ఫైర్ అయ్యారు.