News January 27, 2025

నేడు కోర్టుకు లోకేశ్

image

AP: మంత్రి లోకేశ్ నేడు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు వెళ్లనున్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ కోసం ఆయన స్వయంగా హాజరుకానున్నారు. 2019కి ముందు వైజాగ్ ఎయిర్‌పోర్టులో లోకేశ్ స్నాక్స్ కోసం ఖర్చయిందని సాక్షి కథనం ప్రచురించింది. ఇది తప్పుడు ప్రచారమని గతంలో ఖండించిన ఆయన, అసత్యాలతో పరువుకు భంగం కల్గించారంటూ రూ.75 కోట్లకు దావా వేశారు.

Similar News

News December 9, 2025

సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.

News December 9, 2025

గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.

News December 9, 2025

‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

image

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.