News February 5, 2025
రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి

AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్నాథ్ హామీ ఇచ్చారు.
Similar News
News January 25, 2026
ఇంట్లో అద్దం ఏ వైపున ఉండాలంటే..?

అద్దాలు సరైన దిశలో ఉంటేనే ఇల్లు దోషరహితం అవుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అద్దాలు తూర్పు, తూర్పు-ఈశాన్యం, ఉత్తర-ఈశాన్యం గోడలకు అమర్చాలని సూచిస్తున్నారు. అలా ఉండటమే శ్రేయస్కరం అంటున్నారు. ‘వీటి వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దీర్ఘచతురస్ర, వృత్తాకార అద్దాలు ఉత్తమం. పగిలిన అద్దాలు ఉంచకూడదు. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అప్పుడే వాస్తు బలం చేకూరుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 25, 2026
పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

పద్మ <<18955699>>అవార్డు<<>> గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. “పలు రంగాలలో అద్భుత సేవలు చేసిన పద్మ అవార్డు గ్రహీతల కృషి యువతకు స్ఫూర్తి” అని కొనియాడారు. అదే విధంగా TG సీఎం రేవంత్ రెడ్డి, AP సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిని అభినందించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, కళారంగంలో దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా తదితరులు పురస్కారాలకు ఎంపికయ్యారు.
News January 25, 2026
రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన రేపు ఢిల్లీలో PCCల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్రం MGNREGAను జీ రామ్ జీ బిల్లుగా మార్చిన అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే దిశగా చర్చించనున్నారు. అలాగే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలతో పాటు ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరగనున్నాయి.


