News February 20, 2025
ఒంటరితనం భయంకరమైంది: సమంత

ఒంటరితనం అనేది చాలా భయంకరమైనదని సమంత అన్నారు. తను మూడురోజుల పాటు మొబైల్, సోషల్ మీడియా, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా మౌనంగా గడిపానని తెలిపారు. ఈజర్నీ తనలో ఎంతో పరివర్తన తెచ్చిందని, మానసిక ప్రశాంతత లభించిందన్నారు. మానసికంగా శక్తిమంతంగా మారాలంటే ఇటువంటి మార్గాలను ప్రయత్నించండని సమంత ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ‘రక్త్బ్రహ్మాండ్’ అనే చిత్రంలో సమంత నటిస్తున్నారు.
Similar News
News December 9, 2025
రామన్నపేట ఆర్ఐ రాజేశ్వర్ సస్పెండ్

రామన్నపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రాజేశ్వర్ను సస్పెండ్ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. కక్కిరేణిలోని శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎకరాల భూమి ధరణిలో తప్పుగా నమోదైంది. దీనిపై 2024లో ఆర్ఐ పంచనామా చేసి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే, 2025 జనవరిలో క్షేత్రస్థాయికి వెళ్లకుండా తప్పుడు పంచనామా ఇచ్చినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.
News December 9, 2025
మండలానికొక జన ఔషధి కేంద్రం: సత్యకుమార్

AP: నకిలీ, నిషేధిత మందులు మార్కెట్లోకి రాకుండా నిఘా పెట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ‘ఇటీవల 158 షాపుల్ని తనిఖీ చేస్తే 148కి సరైన అనుమతులు లేవు. సిబ్బంది అక్రమాలను ఉపేక్షించేది లేదు. అవసరమైన సిబ్బందిని APPSC ద్వారా కాకుండా MSRBతో నియమిస్తాం’ అని పేర్కొన్నారు. మండలానికొక జన ఔషధి కేంద్రం ఏర్పాటు యోచన ఉందన్నారు. 11 డ్రగ్ కంట్రోల్, 2 ల్యాబ్ భవనాల్ని మంత్రి వర్చువల్గా ప్రారంభించారు.
News December 9, 2025
పిల్లల ఎదుట గొడవ పడుతున్నారా?

తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే అది పిల్లల్లో భయం, ఆందోళనకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి వారి మానసిక ఆరోగ్యం, చదువు, నిద్ర, సామాజిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. అలాగే పెద్దలను అనుకరించే పిల్లలు అదే ప్రవర్తనను తమ జీవితంలో అలవర్చుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు విభేదాలను శాంతంగా పరిష్కరించుకోవాలి.


