News July 5, 2025
ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.
Similar News
News July 5, 2025
డైట్ కోక్ అధికంగా తాగుతున్నారా?

చాలా మంది షుగర్ ఉండదనే నెపంతో డైట్ కోక్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, వీటిని అమితంగా సేవించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డైట్ కోక్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అలాగే అప్పుడప్పుడు వీటిని తాగితే హాని ఉండదని పేర్కొన్నారు. కానీ దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే జీవక్రియ దెబ్బతినడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
News July 5, 2025
భారత్, బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దీనికి అంగీకారం తెలిపాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం IND, BAN మధ్య 3 వన్డేలు, 3 టీ20లు జరగాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సిరీస్ రద్దయ్యే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News July 5, 2025
టెట్ ప్రిలిమినరీ కీ విడుదల

తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదలైంది. ఈ నెల 8 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని అధికారులు పేర్కొన్నారు. గత నెల 18 నుంచి 30 వరకు 9 రోజుల పాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్-1కు 74.65శాతం, పేపర్-2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 73.48, పేపర్-2(సోషల్ స్టడీస్)కు 76.23శాతం అభ్యర్థులు హాజరయ్యారు. కీ కోసం ఇక్కడ <