News April 11, 2024

ప్రధాని మోదీని కలిసేందుకు ఎదురుచూస్తున్నా: మస్క్

image

భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కోసం తాను ఎదురుచూస్తున్నానని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈనెల 22న వీరి భేటీ జరగనున్నట్లు సమాచారం. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై వారు చర్చించే అవకాశం ఉందని, పీఎంతో భేటీ అనంతరం దీనిపై మస్క్ అప్‌డేట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మోదీ, మస్క్ చివరగా గతేడాది జూన్‌లో యూఎస్‌లో కలిశారు. మళ్లీ ఇప్పుడు కలవనున్నారు.

Similar News

News January 26, 2026

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధానికి ధర్మాన లేఖ

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై PM మోదీకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. భూమి రికార్డులను ఆధునికీకరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా YCP చట్టం తెచ్చినట్లు వివరించారు. CBN ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలు చట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు CMలతో సమావేశమై చర్చించాలని సూచించారు.

News January 26, 2026

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన.. BJP MP వ్యాఖ్యల దుమారం

image

బెంగాల్‌లో త్వరలో రాష్ట్రపతి పాలన అంటూ BJP MP అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ పెద్ద స్కామ్ వెలుగులోకి వస్తుందని.. దానిపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతారని అన్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతిని రాష్ట్రపతి పాలనకు డిమాండ్లు వస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై TMC వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

News January 26, 2026

BJPకి రాజీనామా.. మళ్లీ BRSలోకి మాజీ MLA

image

TG: వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ BJP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎల్లుండి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమై బీజేపీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వర్ధన్నపేట నుంచి రమేశ్ 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో BRS తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 మార్చిలో BJPలో చేరారు. తాజాగా BRS ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.