News July 25, 2024

పొత్తు కోసం జగన్ ఢిల్లీ వెళ్లినట్లుంది: మంత్రి పయ్యావుల

image

AP: ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ ఢిల్లీ వెళ్లినట్లుందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ‘ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి రావాలి. జగన్ చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెట్టాలి. దీనిపై చర్చించి సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఢిల్లీ రోడ్లపై శాంతి భద్రతలపై గగ్గోలు పెట్టడం దేనికి? లా అండ్ ఆర్డర్‌పై ఇవాళే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.

Similar News

News January 10, 2026

సగం ధరకే వ్యవసాయ యంత్రాలు.. ఎలా అప్లై చేయాలి?

image

తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీని కింద లబ్ధిదారులకు 40% నుంచి 50% రాయితీతో ఆధునిక యంత్రాలను అందిస్తారు. సంక్రాంతి నుంచి అమలయ్యే ఈ స్కీమ్ వల్ల 1.30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి అర్హతలు, రాయితీ, అందించే యంత్రాలు, దరఖాస్తు వివరాల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News January 10, 2026

ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

image

AP: అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఊరట కల్పించింది. పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగాల విషయాల్లో కీలక ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ జీవో 58 ప్రకారం అల్టర్నేట్ ఉద్యోగం కావాలా? పరిహారం కావాలా? అనే విషయాన్ని తెలియజేస్తూ 8 వారాల్లో ఆప్షన్స్ ఇవ్వాలంది. అదనపు పరిహారం కోసమైతే 3 నెలల్లో, ప్రత్యామ్నాయ ఉద్యోగమైతే ఖాళీలను బట్టి 6 నెలల్లో పరిష్కరించాలని రవాణా శాఖను ఆదేశించింది.

News January 10, 2026

ఇరాన్‌ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

image

ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా భారత బాస్మతి రైస్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. రియాల్‌ విలువ భారీగా పతనమవడంతో ఆహార దిగుమతులపై సబ్సిడీని టెహ్రాన్‌ ఎత్తివేసింది. దీంతో రూ.2 వేల కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్‌ పోర్టుల్లోనే నిలిచిపోయింది. దీనితో పంజాబ్‌, హరియాణాలకు చెందిన రైస్‌మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోకు రూ.3-4 వరకు ధరలు పడిపోవడంతో రైతులకూ నష్టం వాటిల్లుతోంది.