News September 24, 2025
నాకు ఏ కష్టమొచ్చినా వేంకటేశ్వరస్వామి ఆదుకున్నారు: సీఎం

AP: తిరుమల శ్రీవారికి ఎక్కువసార్లు పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం తనకు దక్కిందని CM చంద్రబాబు అన్నారు. ‘బ్రహ్మోత్సవాల్లో 14సార్లు పట్టువస్త్రాలిచ్చే అవకాశం కల్పించారు. చిన్నప్పటి నుంచి వేంకటేశ్వరుడిని చూస్తూనే పెరిగా. నాకు ఎలాంటి కష్టం వచ్చినా స్వామి ఆదుకున్నారు. ఆయన దయ వల్లే ఎవరికైనా శాంతి, సౌభాగ్యం. హిందువులుండే ప్రతిచోటా, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలి’ అని అన్నారు.
Similar News
News February 6, 2026
ఎప్స్టీన్ బతికే ఉన్నాడా?

ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ బతికే ఉన్నాడంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఉన్న బడా బాబులు తప్పించుకునేందుకు అతడు చనిపోయాడనే కుట్రకు తెరతీసి దేశం దాటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటికి ఆధారంగా పేర్కొంటూ కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు అతడిది సూసైడ్ కాదని.. కావాలనే హత్య చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
News February 6, 2026
U19 WC ఫైనల్: రికార్డులు కొల్లగొట్టిన భారత్

ఇంగ్లండ్తో U19 WC ఫైనల్లో యువ భారత్ పలు రికార్డులు బద్దలు కొట్టింది.
*U19 WC ప్లే ఆఫ్స్లో 350+ స్కోరు చేసిన తొలి జట్టు.
*U19 WC చరిత్రలో 400+ స్కోర్లు ఏకంగా 3 సార్లు చేసింది.
*యూత్ ODIsలో 25 ఇన్నింగ్స్లలోనే <<19067167>>వైభవ్<<>> 110 సిక్సులు బాదారు. ఇంకెవరూ అతడి దరిదాపుల్లో లేరు.
*ఈ టోర్నీలో హయ్యెస్ట్ ఛేజింగ్ 311 పరుగులు. అది కూడా అఫ్గాన్తో సెమీస్లో ఇండియా నమోదు చేసింది.
News February 6, 2026
పత్తి అమ్మకాలకు “కపాస్ కిసాన్” యాప్లో నమోదు ఎలా?

“కపాస్ కిసాన్” యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.


